డెంగీ లక్షణాలతో ఒకరు మృతి | one dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో ఒకరు మృతి

Sep 19 2017 9:52 PM | Updated on Sep 20 2017 11:51 AM

అప్పిలేపల్లికి చెందిన చాకలి రమేష్‌ (40) డెంగీ లక్షణాలతో మంగళవారం మృతి చెందాడు.

కుందుర్పి: అప్పిలేపల్లికి చెందిన చాకలి రమేష్‌ (40) డెంగీ లక్షణాలతో మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. దినసరి కూలీ అయిన రమేష్‌ రెండు వారాల కిందట కర్ణాటకలోని చిత్రదుర్గం వెళ్లి డెంగీ బారిన పడ్డాడు. పది రోజులపాటు చికిత్సలు చేయించుకున్నా కోలుకోలేకపోయాడు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు రమేష్‌ తమ్ముడు మరిస్వామి తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement