అధికారికంగా నిర్వహించాలి | officially manage the liberation day | Sakshi
Sakshi News home page

అధికారికంగా నిర్వహించాలి

Sep 15 2016 10:20 PM | Updated on Mar 29 2019 9:31 PM

అధికారికంగా నిర్వహించాలి - Sakshi

అధికారికంగా నిర్వహించాలి

అర్వపల్లి : సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు.

అర్వపల్లి : సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి రజాకార్ల వారసులుగా ఉన్న ఎంఐఎం పార్టీకి భయపడి ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి భయపడుతుందన్నారు. 17న వరంగల్‌లో తిరంగయాత్ర ముగింపు సభ జరుగుతుందని ఈసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకుడు జీడి భిక్షం, మండల అధ్యక్షుడు కూర శంకర్, బి.నాగయ్య, పి.వీరేష్‌యాదవ్, రాములు, మల్లయ్య, వెంకటేశ్వర్లు, భిక్షంరెడ్డి, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement