ట్రిపుల్‌ఐటీ ఫలితాల విడుదల | Nuzivid IIIT results annouced | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ ఫలితాల విడుదల

May 14 2016 8:43 PM | Updated on Sep 4 2017 12:06 AM

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ట్రిపుల్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో డెరైక్టర్ ఆచార్య వీరంకివెంకటదాసు, పరిపాలనాధికారి ఆచార్య పి.అప్పలనాయుడు 2015-16 విద్యాసంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు.

నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ట్రిపుల్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో డెరైక్టర్ ఆచార్య వీరంకివెంకటదాసు, పరిపాలనాధికారి ఆచార్య పి.అప్పలనాయుడు 2015-16 విద్యాసంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. 2015-16 సంవత్సరం బ్యాచ్ ఫలితాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఫలితాలు గతం కంటే మెరుగవ్వడం విశేషం!. పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం వరకు మొత్తం ఆరు సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాలు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఈనెల 16నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement