
ఆ కంపెనీతో సంబంధం లేదు
విశాఖపట్టణంలో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధంలేదని రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు
చంద్రగిరి : విశాఖపట్టణంలో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తనకు ఎటువంటి సంబంధంలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. చంద్రగిరిలో శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యూష కంపనీ రుణ బకాయిలను చెల్లించనందుకు ఇండియన్ బ్యాంకు అధికారులు మంత్రి ఆస్తులను స్వాధీ నం చేసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై మంత్రిని ప్రశ్నించగా, ఆ కం పెనీ డైరెక్టర్గా 2010లో రాజీనామా చేశానని తెలిపారు. కంపెనీకి తాను గ్యారెంటర్గా ఉన్న మాట వాస్తవమేనని, కంపెనీ దివాలా తీయడంతో తనకు నోటీసులు అందించారని చెప్పా రు. కంపెనీ డైరెక్టర్లతో సమావేశమై ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చర్చిస్తామని తెలిపారు.