
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.
గురువారం 61,199 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.