నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్... | Nellore district police arrested four Redwood smugglers | Sakshi
Sakshi News home page

నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్...

Apr 12 2016 8:00 PM | Updated on Oct 20 2018 6:04 PM

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

-  రూ.44.5లక్షలు స్వాధీనం
స్టోన్‌హౌస్ పేట (నెల్లూరు)

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.55 లక్షల విలువైన ఎర్రచందనం, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విశాల్ గున్నె మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

 

పేరం ప్రవీణ్, పొదిలి నాగరాజు, బూదూరు లోకేష్, ఎగ్గోని వెంకట కృష్ణారెడ్డితోపాటు మరో ఇద్దరు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం సెంటర్ వద్ద వారిని పట్టుకున్నారు. వారి నుంచి 44.50 లక్షల నగదు, రూ.5.60 లక్షలు విలువ చేసే 23 ఎర్రచందనం దుంగలు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement