
అన్నమో రామచంద్రా..
అవి మామూలు పోటీలు కాదు. దేశవ్యాప్తంగా 400 జిల్లాల నుంచి వేలమంది క్రీడాపాటవాన్ని చాటే జాతీయ అథ్లెటిక్స్ పోటీల వేదిక. క్రీడా పాటవం సంగతేమోగానీ...
అవి మామూలు పోటీలు కాదు. దేశవ్యాప్తంగా 400 జిల్లాల నుంచి వేలమంది క్రీడాపాటవాన్ని చాటే జాతీయ అథ్లెటిక్స్ పోటీల వేదిక. క్రీడా పాటవం సంగతేమోగానీ.. క్రీడాకారులు, వారితోపాటు వచ్చిన నిపుణులు కడుపు నింపుకొనేందుకు పోటీ పడాల్సిన దుస్థితి దాపురించింది. వచ్చిన వారందరికీ సరిపోయేలా భోజనాలు సమకూర్చడంలో నిర్వాహకులు విఫలం కావడంతో భోజనశాలలో క్రీడాకారులు తమ సత్తా చూపాల్సివచ్చింది. ఫలితం... దొమ్మీ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఒక్క లోపం తప్ప ఉక్కునగరం స్టేడియంలో శుక్రవారం జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
జాతీయ అంతర జిల్లాల జూనియర్ అథ్లెటిక్ మీట్కు వచ్చిన క్రీడాకారులతో పాటు టెక్నికల్ అఫీషియల్స్ భోజనాల కోసం పడిగాపులు పడ్డారు. అన్నానికి పరుగు పెట్టగా.. చపాతిల కోసం ఒకరిపై ఒకరు పడి దక్కించుకోవల్సిన పరిస్థి ఏర్పడింది. కేటరింగ్కు వచ్చిన వారితో క్రీడాకారులు ఘర్షణ పడ్డారు. నాలుగు వేల మందికే తమను తయారు చేయమన్నారని కేటరింగ్ వాళ్లు గోలపెట్డారు. టెక్నికల్ అఫీషియల్స్, పీఈటీలు భోజనం లేకుండానే మీట్ను నిర్వహించారు. రెండు గంటలకే లాంగ్జంప్, షాట్పుట్, జావెలిన్లతో పాటు ఆరువందల మీటర్ల పరుగు ఫైనల్స్ ప్రారంభం కావల్సి ఉన్నా క్రీడాకారులంతా భోజనం కోసమే పడిగాపులు పడ్డారు. దీంతో షెడ్యూలు సైతం మారిపోరుుంది. - విశాఖపట్నం
కుర్చీ కోసం పాట్లు
సాక్షాత్తు కేంద్రమంత్రి ఎదుటే రాజకీయ నాయకులు కుర్చీల కోసం పోటీ పడ్డారు. అథ్లెటిక్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో వేదికపై పదే కుర్చీలను వేశారు. వెనుక వరుసలో మరికొన్ని కుర్చీలు వేసినా రాజకీయ నాయకులంతా తొలివరుస సీట్లలో కూర్చునేందుకే పోటీపడ్డారు. ఈ క్రమంలో పోటీలకు వేదికగా నిలిచిన స్టీల్ప్లాంట్ ఎండీ వెనుక సీట్లోనే కూర్చుండిపోయారు. తరువాత ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును లేపి మరీ ఆయన్ని కూర్చోపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సైతం వెనుక వరసలోనే కూర్చోవాల్సి వచ్చింది.