నారాయణ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
ఏపీలోని రాజమండ్రిలో ఘటన
చెట్టుకు ఉరివేసుకొని మృతి
కాలేజీలో ఒత్తిడే కారణమంటున్న తల్లి
రాజమండ్రి క్రైం: ఆంధ్రప్రదేశ్లో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దాసరి నందిని(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నందిని స్వస్థలం ఒంగోలు. తండ్రి ప్రసాద్ గతంలోనే మృతి చెందాడు. దీంతో నందినిని, ఆమె చెల్లెలిని తీసుకొని వారి తల్లి నిర్మల తన పుట్టిల్లయిన రాజమండ్రికి వచ్చేసింది. నిర్మల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది.
నందిని స్థానికంగా ఓ బాలికల హాస్టల్లో ఉంటూ దానవాయిపేటలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలు బాగా రాయలేదని స్నేహితుల వద్ద బాధపడింది. సోమవారం రాత్రి హాస్టల్ ఎదుట ఉన్న రావిచెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కాలేజీలో ఒత్తిడి తాళలేక ఆత్మహత్య: తల్లి నిర్మల ఆదివారం నందినిని బయటకు తీసుకెళ్లింది. ఆ సందర్భంగా నందిని తన గోడు వెళ్లబోసుకుంది. నారాయణ కాలేజీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లికి చెప్పింది. కాలేజీలో ఒత్తిడికి తాళలేక తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని నిర్మల రోదించింది.
ఐ మిస్ యూ..
నందినికి సహ విద్యార్థినులు వనం దుర్గాభవాని, పోలిపల్లి దేవిక ప్రాణ స్నేహితులు. వారితో నాలుగు రోజుల క్రితం చిన్నపాటి స్పర్థ ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు వారినుద్దేశించి నందిని తన నోట్బుక్లో ఒక లేఖ రాసింది. ‘నాతో మాట్లాడరనుకున్నాను. మాట్లాడుతున్నందుకు సంతోషం. వచ్చే జన్మలో కూడా మీరే నా స్నేహితులుగా పుట్టాలి. ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్లక్’ అని అందులో రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్లక్
Published Wed, Oct 14 2015 4:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement