ఫుడ్‌కోర్టు తొలగింపు యత్నం.. వివాదం


విజయవాడ: ఫుడ్‌కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్‌ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.



ఈ ధర్నాకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్‌కోర్టు తొలిగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. చివరకు జిల్లా కలెక్టర్‌ జోక్యంతో ఫుడ్‌కోర్టు తొలగింపు వివాదం కాస్తా సద్దుమనిగింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top