ఈనెల 9, 10న జరగాల్సిన ఎంపీఈఓ (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్) ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీఈఓ ఇంటర్వ్యూలు వాయిదా
Aug 4 2016 1:34 AM | Updated on Aug 20 2018 6:18 PM
అనంతపురం అగ్రికల్చర్ : ఈనెల 9, 10న జరగాల్సిన ఎంపీఈఓ (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్) ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 124 పోస్టుల భర్తీకి గానూ అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే కాల్లెటర్లు పంపామన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామన్నారు. తదుపరి ఇంటర్వ్యూలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.
Advertisement
Advertisement