రైలు కింద పడి తల్లీకూతుళ్ల మృతి | mother and daughter died in train accident incident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి తల్లీకూతుళ్ల మృతి

Dec 24 2015 7:54 AM | Updated on Sep 3 2017 2:31 PM

కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.

చుండూరు(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుస్మిత(35), కూతురు(5) మృతి చెందగా.. కుమారుడు(3) తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా చుండూరు మండలం  ఎడ్లపల్లిలో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సుస్మిత(35)ది హైదరాబాద్ కాగా, ఆమె భర్త గుజరాత్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement