కొత్త పంటలతో అధిక దిగుబడులు | more gain with new crops | Sakshi
Sakshi News home page

కొత్త పంటలతో అధిక దిగుబడులు

Oct 4 2016 10:48 PM | Updated on Sep 28 2018 7:14 PM

కొత్త పంటలతో అధిక దిగుబడులు - Sakshi

కొత్త పంటలతో అధిక దిగుబడులు

కొత్త పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్‌ రైతులకు పిలుపునిచ్చారు.

పి.కోటకొండ(దేవనకొండ) :  కొత్త పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్‌ రైతులకు పిలుపునిచ్చారు. దేవనకొండ మండలం పి. కోటకొండ సమీప పొలాల్లో సాగు చేసిన గర్కిన్‌ దోస, అల్లోమిన్‌ పంటలను ఆయన మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట దిగుబడులు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అల్లోమిన్‌ మిరప పంటను జిల్లాలో ఎక్కడా సాగు చేయడంలేదని, పి.కోటకొండ గ్రామంలో సాగుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కొత్తకొత్త పంటలను సాగుచేసి పలువురు రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పంటలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ వెంట ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్‌ తిరుమలవాణి, వీఆర్వో సీతారామిరెడ్డి, ఉద్యానవనశాఖ సిబ్బంది ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement