మదనపల్లెలో దారుణం | mob killed innocent dum boy in madanapalle of chitoor district | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో దారుణం

Oct 24 2015 10:24 PM | Updated on Sep 3 2017 11:25 AM

మదనపల్లెలో దారుణం

మదనపల్లెలో దారుణం

సోదరిని పలుకరించేందుకు వెళ్లి వస్తున్న మూగ యువకుడిని అనుమానితుడిగా భావించి జనం కొట్టి చంప్పారు.

- దొంగ అనుకొని మూగ యువకుణ్ని చావగొట్టిన జనం

మదనపల్లె రూరల్:
చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. సోదరిని పలుకరించేందుకు వెళ్లి వస్తున్న మూగ యువకుడిని అనుమానితుడిగా భావించి జనం కొట్టి చంపిన సంఘటన మదనపల్లె శివారు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబుకాలనీలో ఉంటున్న లారీడ్రైవర్ షేక్ అన్వర్‌బాషా కుమారుడు షేక్ చాన్‌బాషా(24) మాటలు రావు. శుక్రవారం రాత్రి అమ్మచెరువుమిట్ట సమీపంలోని రంగనాథ పెట్రోల్ బంకు వెనుక ఇందిరమ్మ కాలనీలో ఉన్న తన అక్క షాహీన వద్దకు వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు.


మార్గ మధ్యంలో గొర్రెల మంద వద్ద ఉన్న కాలనీవాసులు యువకుడిని అడ్డగించారు. చాన్‌బాషా మూగవాడు కావడంతో మాట్లాడలేక సైగలు చేశాడు. దీంతో వారు చోరీ చేసేందుకు వచ్చాడని భావించి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన చాన్‌బాషా ఇంటికి వె ళ్లి తండ్రి అన్వర్‌బాషాకు జరిగిన విషయాన్ని సైగలతో చెప్పి పడిపోయి ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతికి కారకులైన లారీ లోడర్ మస్తాన్, మరో వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement