కుమారుడిని చూసి ఆనందబాష్పాలు రాల్చిన తల్లిదండ్రులు
గుత్తి : చదువు మీద ఇష్టం లేక హాస్టల్ నుంచి పారిపోయిన ఓ బాలుడు పోలీసుల చొరవతో నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన గుత్తిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ, సువర్ణ దంపతుల కుమారుడు రమేష్ గుత్తిలోని నంబర్–3 హాస్టల్లో 4వ తరగతి చదువుతూ ఉండేవాడు. ఈ క్రమంలో చదువు మీద ఇష్టం లేక 2013, మే 5న హాస్టల్ నుంచి పారిపోయి గుంటూరు చేరాడు. గుంటూరులో తన పెద్దమ్మ గాయత్రి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అడ్రస్ తెలియకపోవడంతో గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాడు.
అక్కడ ఏంచేయాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండేవాడు. ఒక రోజు ఎస్కేసీవీ చిల్డ్రెన్ ట్రస్ట్ సభ్యులు ఆ బాలున్ని గమనించారు. దగ్గరకు తీసుకుని ఆరా తీశారు. తనకు ఎవరూ లేరని, అనాథనని చెప్పాడు. దీంతో ట్రస్ట్ సభ్యులు బాలుడిని గాంధీ నగర్లో ఉన్న అనాథ ఆశ్రమంలో చేర్పించి చదివించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు. అయితే ఏ కారణం చేతనో బాలుడికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. వెంటనే అనాథ ఆశ్రమం వారిని కలిసి తాను అనాథను కాదని, తల్లిదండ్రులు గుంతకల్లులో ఉన్నారని చెప్పాడు. దీంతో అనాథ ఆశ్రమం, ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని గుంతకల్లు పోలీసులకు ఫోన్లో సమాచారమిచ్చారు. అయితే వారు స్పందించలేదు. దీంతో గుత్తి ఎస్ఐ చాంద్ బాషాకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఆ బాలున్ని గుత్తికి రప్పించారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆ బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారున్ని నాలుగేళ్ల తర్వాత చూడటంతో తల్లిదండ్రులు సంతోషంతో తబ్బిబ్బైయ్యారు. చొరవ చూపి తమ కుమారున్ని అప్పగించిన ఎస్ఐ చాంద్బాషాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
Published Tue, May 16 2017 11:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement