తూర్పు ఏజెన్సీలో మావోల కదలికలు | maoist movements in east agency | Sakshi
Sakshi News home page

తూర్పు ఏజెన్సీలో మావోల కదలికలు

Feb 10 2017 12:25 AM | Updated on Oct 9 2018 2:38 PM

ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ సరిహద్దులో ఇటీవల జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్‌ లో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే ఇ¯ŒSఫార్మర్ల నెపంతో గిరిజనులను హత్య చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా

రంపచోడవరం :  
ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ సరిహద్దులో ఇటీవల జరిగిన భారీ ఎ¯ŒSకౌంటర్‌ లో కోలుకోలేని  దెబ్బతిన్న మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే ఇ¯ŒSఫార్మర్ల నెపంతో గిరిజనులను హత్య చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా ఏఓబీలోని విశాఖ అటవీ ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు తూర్పు ఏజెన్సీలో తిరిగి ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా చేపడుతున్న చర్యలను పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయి. తూర్పు ఏజెన్సీలోని లోతట్టు గ్రామాల్లో సంచరిస్తూ రాత్రి సమయంలో గ్రామాల్లో గిరిజనులతో సమావేశమవుతున్నారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో, పాతకోట, జంగాలతోట, తూర్పు సరిహద్దులోని  మంపా వంటి  లోతట్టు గిరిజన గ్రామాల్లో మావోలు కదలికలు ఉన్నట్లు పోలీస్‌లకు సమాచారం ఉంది. గుర్తేడు సమీపంలోని బందమామిడి గ్రామంలో  సమావేశం నిర్వహించి పోలీసులకు సహకరిస్తున్నరంటూ కొంత మందిని హెచ్చరించారు. గతంలో మిలీషియా సభ్యులుగా పనిచేసి మావోలకు సహకరించిన వారిని  తిరిగి బలోపేతం చేయడం ద్వారా  పోలీ సు కదలికలపై సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏజెన్సీలో  కొంత మం దిని వచ్చి కలవాల్సిందిగా  కబురు పంపినట్లు సమాచారం. వీరిలో ఒక సర్పంచ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మావోలకు ఎదురులేని గ్రామాల్లో కూడా పూర్తిగా పట్టుకోల్పోవడం, ఎ¯ŒSకౌంటర్లు, లొంగుబాట్ల ద్వారా ఉద్యమ తీవ్రత తగ్గిపోయింది. అయితే గతంలో దళాలుగా సంచరించిన మావోలు ప్రస్తుతం యాక్ష¯ŒS ప్లాటూన్లుగా  సంచరిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన మావోయిస్టు  నాయకులు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నాయకత్వంలో స్థానిక క్యాడర్‌ పనిస్తున్నట్లు తెలుస్తున్నది. పట్టుకోల్పోయిన తూర్పు ఏజెన్సీలో తిరిగి ఉద్యమానికి జవసత్వాలు నింపేం దుకు వ్యూహరచన చేసే పనిలో మావోలు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉద్యమంలో ఉన్న స్థానిక నాయకుల సూచనల మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల ఉనికే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు పక్కా సమాచార వ్యవస్థ ద్వారా ఎప్పుడో మావోల  నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేశారు. వారి కదలికపై ఎప్పకప్పుడు పక్కా సమాచారాన్ని రాబట్టి కూంబింగ్‌ ముమ్మరం చేస్తున్నారు. మావోలు  నిధుల సమీకరణపై కూడా  దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. నోట్ల రద్దు వంటి కారణాల వల్ల మావోలకు నిధుల కొరత ఏర్పడిందనే  అనుమానాలు లేకపోలేదు. మావోల కదలిలపై మారేడుమిల్లి సీఐను వివరణ కోరగా లోతట్టు ప్రాంతంలో కదలికలు ఉన్నట్లు వెల్లడించారు. 
 
మావోలకు వ్యతిరేకంగా ర్యాలీ
రంపచోడవరం :  
మావోయిస్టులకు వ్యతిరేకంగా గురువారం రంపచోడవరంలో మోటార్‌ యూనియ¯ŒS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆటో, లారీ, కార్లు యూనియా¯ŒS నాయకులు, సభ్యులు ర్యాలీ చేసి అమాయకులైన గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల వారి కుటుంబాలు దిక్కులేని వారై రోడ్డున పడతాయని వాపోయారు. ఉద్యమం, హత్యల ద్వారా ఇప్పటి వరకు వారు సాధించి ఏమీ లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement