ట్రాక్టర్,బైక్ ఢీ: ఒకరి మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్,బైక్ ఢీ: ఒకరి మృతి

Oct 18 2016 2:58 PM | Updated on Apr 3 2019 7:53 PM

కౌడిపల్లి మండలం బుజిరంపేట సమీపంలో సోమవారం రాత్రి బైక్, ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

మెదక్: కౌడిపల్లి మండలం బుజిరంపేట సమీపంలో సోమవారం రాత్రి బైక్, ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వెలమకన్న గ్రామానికి చెందిన పోలా లక్ష్మీనారాయణ(35) అనే టైలర్ సోమవారం సాయంత్రం జోగిపేటకు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. టైలర్ వృత్తి మీదే ఆధారపడిన ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కౌడిపల్లి ఎసై్స శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement