వ్యక్తి మృతి.. భోగాపురంలో ఉద్రిక్తత | man died due to college negligence over electric wires in eluru | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి.. భోగాపురంలో ఉద్రిక్తత

Nov 26 2015 11:45 AM | Updated on Mar 21 2019 9:07 PM

పశ్చిమ గోదావరి జిల్లా భోగాపురంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బైబిల్‌ కాలేజ్‌ దగ్గర విద్యుత్‌ తీగలు తగలి నాగరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా  భోగాపురంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక బైబిల్‌ కాలేజ్‌ దగ్గర విద్యుత్‌ తీగలు తగలి నాగరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.  దీంతో కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదానికి కారణమని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. 

 

కళాశాలపై దాడి చేసి, కాంపౌండ్‌లో ఉన్న బస్సు అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. నాగరాజు కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ మృతదేహాంతో ధర్నాకు దిగారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారితో చర్చలు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement