పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య | lovers commit suicide in nalgonda district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

Jan 19 2016 9:45 AM | Updated on Nov 6 2018 7:56 PM

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించని కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

నార్కెట్‌పల్లి: కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించని కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కన ఉన్న కోనేరు వద్ద మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్న ప్రేమించుకున్నారు. రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది.
 
ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ సోమవారం రాత్రి అక్కినపల్లికి వెళ్లి అక్కడి రామాలయం వద్ద కోనేటి గట్టుపై పురుగుల మందు తాగి మృతి చెందారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement