శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. ఎచ్చర్ల, పొందూరు, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో భూమి కంపించినట్లు తెలిసింది.
రిక్టర్ స్కేలుపై ఎంత నమోదయిందనే సమాచారం ఇంకా రాలేదు. మరోసారి కంపిస్తుందోమోనని జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.