నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం

Published Tue, May 16 2017 10:51 PM

నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం

నారనాగేపల్లి (రొద్దం) : మండలంలోని నారనాగేపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు నేత్రపర్వంగా జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను అమ్మవారికి మోసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి సతీమణి కమలమ్మ, జిల్లా నలమూలల నుంచి పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement