తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా | hero bharath interview with sakshi | Sakshi
Sakshi News home page

తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా

Aug 5 2016 9:16 AM | Updated on Sep 4 2017 7:59 AM

తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా

తెలుగు పరిశ్రమలోనూ రాణిస్తా

తమిళంలో ఇప్పటి వరకూ దాదాపు 30 సినిమాల్లో హీరోగా నటించిన హీరో భరత్ తెలిపారు.

సినీ హీరో భరత్


అమలాపురం : తమిళంలో ఇప్పటి వరకూ దాదాపు 30 సినిమాల్లో హీరోగా నటించిన తాను తెలుగు పరిశ్రమలోనూ రాణించేందుకు శ్రమిస్తున్నానని హీరో భరత్ అన్నారు. తమిళంలో తాను నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ కావటం ద్వారా ఆరేడేళ్లుగా తెలుగు పరిశ్రమకు సుపరిచితుడేనని చెప్పారు.

రమా రీల్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ గత పదిరోజులుగా కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. అమలాపురంలోని సర్ సీవీ రామన్ పబ్లిక్ స్కూలులో గురువారం జరిగిన ఆ చిత్ర షూటింగ్‌లో భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో నేరుగా హీరో అవకాశం ఏడాది కిందట ‘యువ సేన’ చిత్రం ద్వారా వచ్చిందన్నారు.

ఇప్పుడు తమిళ, తెలుగు వెర్షన్లలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం కూడా మంచి కథ ఉన్న సినిమా అని చెప్పారు. తాను హీరోగా నటించిన ‘ప్రేమిస్తే’ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ కావడంతో హీరోగా మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ‘బోయ్స్’ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడైన తాను తమిళ, తెలుగు రంగాల్లో ఒకేసారి అరంగ్రేటం చేసినట్లయిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం కోనసీమలో షూటింగ్ జరుపుకొంటున్న చిత్రం రొమాంటిక్, యూత్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ కలబోసిన కథతో రూపొందుతున్నందున కచ్చితంగా హిట్ కాగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగలనన్న నమ్మకం బలంగా ఉందని భరత్ చెప్పారు.
 
కేరళ అందాలకు దీటైనవి కోనసీమ సోయగాలు
కోనసీమలోని పచ్చని అందాలు కేరళ రాష్ట్రంలో కొబ్బరి చెట్లతో కూడిన పచ్చదనాన్ని గుర్తుకు తెస్తున్నాయని భరత్ అన్నారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు అధికంగా ఉంటాయని, ఇక్కడ కూడా అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని అన్నారు. మొత్తం మీద కోనసీమ తనను బాగా ఆకట్టుకుందన్నారు.
 
 

స్థానిక సర్ సీవీ రామన్ పబ్లిక్ స్కూలు గురువారం సినిమా షూటింగ్‌తో సందడిగా కనిపించింది. రమా రీల్స్ బేనర్‌పై ఇంకా పేరు పెట్టని చిత్రం కోసం హీరో హీరోయిన్లు భరత్, రుహానీ శర్మ పదేళ్ల అమ్మాయిని స్కూలులో చేర్పించే దృశ్యాలను దర్శకుడు భార్గవన్ చిత్రీకించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూలు లోపల, ఆవరణలో షూటింగ్ సాగింది.

సినిమా మేనేజర్లు మామిళ్లపల్లి రూపేష్, రెడ్డి, నటుడు గునిశెట్టి రమణలాల్, స్కూలు డెరైక్టర్లు పరసా రాజా, రవణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరో వారం రోజులు కోనసీమలోనే పలు ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుందని దర్శకుడు తెలిపారు. ప్రేమ, హాస్యం, వినోదం కలరుుకగా సినిమా సాగుతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement