తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం ఏడుకొండలవాడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.