
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.
ఆదివారం స్వామివారిని 1,00,277 మంది దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.