ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠం భక్తుల సందడితో కళకళలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
శ్రీమఠంలో భక్తుల రద్దీ
May 1 2017 12:29 AM | Updated on Sep 5 2017 10:04 AM
మంత్రాలయం : ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠం భక్తుల సందడితో కళకళలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు గావించి విశేష పూజలు గావించారు. నైవేద్య సమర్పణ, మంగళహారతులు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.
Advertisement
Advertisement