ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు | health checkup completed for mudragada couple | Sakshi
Sakshi News home page

ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు

Feb 5 2016 11:06 AM | Updated on Jul 30 2018 6:21 PM

ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు - Sakshi

ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు

కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

కాకినాడ: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 160/110, షుగర్ లెవల్స్ 178 ఉండగా.. ప్రస్తుతం ఆయన బరువు 86 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 180/110, షుగర్ లెవల్స్ 120గా ఉండగా.. ఆమె బరువు 78 కేజీలుగా వైద్యులు నిర్ధారించారు.

నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు. అయితే ఆయన మద్ధతుదారులు మాత్రం తమ నేత ఇంటి గేట్లు తెరిచేందుకు యత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement