క్రీడలతో మానసికోల్లాసం | happyness life at sports | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Jul 29 2016 11:11 PM | Updated on Sep 4 2017 6:57 AM

క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌.వెంకటేశ్వర్‌రావు అన్నారు. వర్క్‌ పీపుల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ 2015–16 సంవత్సరానికి సంబంధించిన క్రీడా వార్షికోత్సవాన్ని స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలోని ఇండోర్‌ షటిల్‌ కోర్టులో శుక్రవారం నిర్వహించారు.

  • ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌ వెంకటేశ్వర్‌రావు
  • గోదావరిఖని : క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని ఆర్జీ–1 సీజీఎం సీహెచ్‌.వెంకటేశ్వర్‌రావు అన్నారు. వర్క్‌ పీపుల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ 2015–16 సంవత్సరానికి సంబంధించిన క్రీడా వార్షికోత్సవాన్ని స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలోని ఇండోర్‌ షటిల్‌ కోర్టులో  శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సీజీఎం వెంకటేశ్వర్‌రావు, సేవా అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం, ఏకాగ్రత నైపుణ్యత, మంచి క్రమశిక్షణ అవవడుతాయని తెలిపారు.

    ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఎస్‌ఓటూ సీజీఎం ఎ.సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సమ్మయ్య, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ రాజనారాయణరెడ్డి, నాయకులు ఆరెళ్లి పోచం, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, గండ్ర దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  
     
     

Advertisement
 
Advertisement
Advertisement