పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్ | guwahati express 2 coaches side tracked and no damage appears | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్

Nov 17 2015 8:55 AM | Updated on Apr 7 2019 3:28 PM

వైఎస్సార్ జిల్లా నందలూరు సమీపంలో మంటపంపల్లి వద్ద మంగళవారం ఉదయం గౌహతి-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

ఎర్రగుంట్ల : వైఎస్సార్ జిల్లా నందలూరు సమీపంలో మంటపంపల్లి వద్ద మంగళవారం ఉదయం గౌహతి-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి, ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఆ బోగీలలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎర్రగుంట్లలో హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను, కమలాపురంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను, భాకరాపేటలో చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement