రాష్ట్ర స్థాయి 52 కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరాయకొండ గురుకుల పాఠశాల జూనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ఏ గోవిందమ్మ బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్ డి. జయ తెలిపారు.
సింగరాయకొండ: రాష్ట్ర స్థాయి 52 కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరాయకొండ గురుకుల పాఠశాల జూనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ఏ గోవిందమ్మ బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్ డి. జయ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్లిప్టింగ్ పోటీల్లో ఈ ఘనతను సాధించిందన్నారు.
ఈ సందర్భంగా గోవిందమ్మను, ట్రైనర్గా వ్యవహరించిన జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట కేజీబీవీ పీఈటీ ఉపాధ్యాయిని బి హబ్సిబాను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సూపరింటెండెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.