ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం | Government employee disappear | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం

Jul 25 2016 8:28 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిం చకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగింది.

ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిం చకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే పి. రాజగోపాల్‌రావు కుమారుడు పిసివి కృష్ణకుమార్ (27).జిహెచ్‌ఎంసి పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌లో ఏఈగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు, తిరిగి రాలేదు. సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వస్తుంది. దీంతో తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement