మాలల అణచివేతకే జీవో నెం.25 | GO No.25 for discriminating to 'Malas' | Sakshi
Sakshi News home page

మాలల అణచివేతకే జీవో నెం.25

Oct 16 2016 5:44 PM | Updated on Oct 8 2018 8:45 PM

మాలల అణచివేతకే జీవో నెం.25 - Sakshi

మాలల అణచివేతకే జీవో నెం.25

రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రంలో అమలువుతున్న జీవో నెం 25ను వెంటనే రద్దు చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

గుంటూరు (నెహ్రూనగర్‌) :  రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రంలో అమలువుతున్న జీవో నెం 25ను వెంటనే రద్దు చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఎస్సీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా శనివారం మహిమ గార్డెన్స్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి  డాక్టర్‌ చింతామోహన్‌ పాల్గొన్నారు. మల్లెల వెంకట్రావు మాట్లాడుతు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని 2004 సంవత్సరంలో సుప్రీం కోర్టు కొట్టివేసినా కోర్టు తీర్పును ధిక్కరించి మాలల అణిచివేత చేసే  దిశగా మంత్రి రావెల కిషోర్‌బాబు జీవో నెం 25ని తీసుకువచ్చి అమలు చేయటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తు నవంబర్‌ 21వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయల వద్ద ధర్నాలు చేయాలని తీర్మానించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement