జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు ఘోరంగా ఉల్లంఘించబడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అన్నారు. గురువారం స్థానిక ఉద్దరాజు భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాలు ఉల్లంఘిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులు
Aug 20 2016 12:35 AM | Updated on Aug 13 2018 8:12 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు ఘోరంగా ఉల్లంఘించబడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అన్నారు. గురువారం స్థానిక ఉద్దరాజు భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాలు ఉల్లంఘిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గిరిజనుల భూములకు రక్షణ కల్పించే 1/70 చట్టం, గ్రామసభ తీర్మానాలకు అధికారాలున్న పెసా చట్టం, పోడు భూములకు హక్కులు కల్పించే అటవీహక్కుల గుర్తింపు చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘించబడుతున్నాయన్నారు. ఫలితంగా గిరిజనుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పేరుతో లాక్కొని తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement