తిరుమల శేషాచలంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి
శేషాచలంలో అగ్ని ప్రమాదం
Nov 22 2016 3:04 AM | Updated on Sep 5 2018 9:47 PM
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు మార్గం లోని 22వ మలుపు వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో మంట లు వ్యాపించాయి. దట్టమైన పొగ ఎగిసిపడటంతో గమనిం చిన భక్తులు టీటీడీ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందిం చారు. అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కార్చిచ్చు వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇటీవల వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులు ఎండిపోయి, రాపిడి వల్ల మంటలు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
Advertisement
Advertisement