ముగిసిన ఎక్సైజ్‌ క్రీడా పోటీలు | excise games over | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎక్సైజ్‌ క్రీడా పోటీలు

Dec 13 2016 12:13 AM | Updated on Jul 11 2019 8:43 PM

ముగిసిన ఎక్సైజ్‌ క్రీడా పోటీలు - Sakshi

ముగిసిన ఎక్సైజ్‌ క్రీడా పోటీలు

జిల్లా స్థాయి ఎక్సైజ్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయి.

కర్నూలు (టౌన్‌): జిల్లా స్థాయి ఎక్సైజ్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు  ముగిశాయి. మొదటిరోజు ఔట్‌డోర్‌ స్టేడియంలో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. రెండో రోజు సోమవారం ఇండోర్‌ స్టేడియంలో  ఈ పోటీలు కొనసాగాయి. ఇండోర్‌ స్టేడియంలో వివిధ క్రీడాంశాల్లో ఉద్యోగుల మధ్య టెన్నికాయిట్, బాల్‌బాడ్మింటన్, షటిల్‌ బాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. ముగింపు క్రీడల నుద్దేశించి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీరాములు మాట్లాడుతూ.. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులు జనవరి నెల 6, 7, 8 తేదీల్లో గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎక్సైజ్‌ క్రీడా పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement