కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌ | ex dgp at kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌

Sep 24 2016 12:19 AM | Updated on Aug 20 2018 3:37 PM

కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌ - Sakshi

కర్నూలుకు వచ్చిన మాజీ పోలీస్‌బాస్‌

మాజీ పోలీస్‌బాస్‌ (డీజీపీ) జేవీ రాముడు కర్నూలుకు వచ్చి వెళ్లారు.

కర్నూలు: మాజీ పోలీస్‌బాస్‌ (డీజీపీ) జేవీ రాముడు కర్నూలుకు వచ్చి వెళ్లారు. అనంతపురంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఏపీఎస్‌పీ పటాలంలో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆకె రవికృష్ణ, పటాలం కమాండెంట్‌ గోగినేని విజయకుమార్, అడిషనల్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌ శశికాంత్, గోపాలకృష్ణ తదితరులు ఆయనకు పూలబోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతి భద్రతలతో పాటు ఏపీఎస్‌పీ రెండో పటాలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జేవీ రాముడు ఆరా తీశారు. ఆయుధాగారంతో పాటు స్కూలు, పార్కు, పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు కమాండెంట్‌ వివరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement