♦ రుణమాఫీ అంతా మాయ
♦ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు బంధువు నాగరాజునాయుడు
♦ ఆయన ఇచ్చిన పత్రాలు నాలుక గీసుకోవడానికే..
♦ నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన
♦ నారావారిపల్లె జన్మభూమి సభలో ఆందోళన
చంద్రగిరి : ‘మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయాం. రుణమాఫీ ఓ మాయ. మాఫీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పత్రాలు పంపారు. కానీ రుణం మొత్తం కట్టాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి పంపిన పత్రాలు నాలుక గీసుకోవడానికే పనికొస్తాయి.. అసలు రుణమాఫీ చేశారా..?’
ఈ మాటలన్నది ఎవరో కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు కొత్తపల్లి నాగరాజునాయుడు. ముఖ్యమంత్రికి వరసకు బావ అవుతారు. ఆయనది కూడా నారావారి స్వగ్రామం నారావారిపల్లె. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీలోని డొల్లతనాన్ని ఆయన ఉతికి ఆరేశారు. దీంతో ఆదివారంనాడు నారావారిపల్లెలో జరిగిన జన్మభూమి సభలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, అధికారుల దిమ్మతిరిగేలా దుమ్ముదులిపేశారు.
బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులు, రుణమాఫీ పత్రాలను చిరాకొచ్చి గతంలోనే బ్యాంకు అధికారుల ఎదుటే చించేసినట్లు ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నారా, కొత్తపల్లి కుటుంబాలకు చాలా దగ్గరి బంధుత్వం ఉంది. నాగరాజునాయుడు తన 1.14 ఎకరాల భూమికి సంబంధించి పాస్పుస్తకాలను చిత్తూరు జిల్లా రంగంపేట బ్యాంక్లో 2012లో తనఖాపెట్టి 40వేల రూపాయల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. రుణమాఫీ కింద తన రుణం కూడా రద్దయిందని ఆయన భావించాడు. అనుకున్నట్లే ప్రభుత్వం నుంచి పత్రాలు కూడా ఆయనకు అందాయి. కానీ బ్యాంకు ఖాతాలో ఒక పైసా కూడా జమ కాలేదు.
తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని, లేకపోతే పొలాన్ని జప్తు చేస్తామని పలుమార్లు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ముఖ్యమంత్రి సమీప బంధువుని అని మొత్తుకున్నా బ్యాంకు వారు వినలేదు. ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని, తాము మాత్రం ఏం చేస్తామని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ఈనేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి సొంత గ్రామం నారావారిపల్లెలో జన్మభూమి-మా ఊరు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు నాగరాజు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి టీడీపీ నాయకులు, అధికారులను నిలదీశారు. అంతకు ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయలేదని విమర్శించారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.
బాబు బావకే మాఫీ కాలేదు..!
Published Mon, Jan 4 2016 1:27 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
ఓటేసి మా బాధ్యత పూర్తి చేశాం(ఫొటోలు)
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
ఏపీ ఎన్నికల ఓటింగ్ పై కొమ్మినేని విశ్లేషణ
ఓటు హక్కు వినియోగించుకున్న YSRCP నేతలు
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
సూపర్ మామ్: తన క్యూటీస్తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
స్టేజీపై నటిస్తూ కన్నుమూసిన ప్రముఖ నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
తప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement