డాక్టర్ చినమిల్లికి స్టేట్బెస్ట్ సిటిజ న్ అవార్డు
వైఎ న్ కళాశాల కార్యదర్శి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణకు స్టేట్ బెస్ట్ సిటిజ న్ అవార్డు లభించింది. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ, అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్యలు కలిసి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి.
నరసాపురం : వైఎ న్ కళాశాల కార్యదర్శి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణకు స్టేట్ బెస్ట్ సిటిజ న్ అవార్డు లభించింది. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ, అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్యలు కలిసి ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ చినమిల్లి 50 ఏళ్లుగా నరసాపురం ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్య సదుపాయాలు లేని రోజుల్లో స్థానికంగా పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేసిన ఘనత ఆయనది. మరోవైపు విద్యారంగానికి కూడా ఆయన దశాబ్ధాలుగా సేవలందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన వైఎ న్ కళాశాలకు 1983 నుంచి కార్యదర్శిగా ఎన్నికవుతూ వస్తున్నారు. కళాశాలకు నాక్ గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేశారు. లయ న్స్ జిల్లా గవర్నర్గా కూడా పనిచేశారు. స్టేట్బెస్ట్ సిటిజన్ అవార్డు అందుకున్న డాక్టర్ చినమిల్లిని కళాశాల ఉపాధ్యక్షుడు జీవీకే రామారావు, కోశాధికారి డాక్టర్ వై.గోపాలకృష్ణ, జీబీ మెంబర్లు పోలిశెట్టి రఘురామారావు, కానూరి స్వామినాయుడు, ప్రిన్సిపాల్ కేవీసీఎస్ అప్పారావు, పీజీ కోర్సుల డైరెక్టర్ డాక్టర్ ఎన్ .చింతారావు అభినందించారు.