‘ఓపి’క నశిస్తోంది | doctors scare in hindupur hospital | Sakshi
Sakshi News home page

‘ఓపి’క నశిస్తోంది

Sep 10 2016 11:31 PM | Updated on Sep 4 2017 12:58 PM

‘ఓపి’క నశిస్తోంది

‘ఓపి’క నశిస్తోంది

పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల ఓపిక నశిస్తోంది. శనివారం ఓపి (ఔట్‌ పేషెంట్స్‌)కి చిన్నపిల్లల విభాగానికి సంబంధించి వందల సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను వైద్యం కోసం తీసుకువచ్చారు.

హిందూపురం టౌన్‌ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల ఓపిక నశిస్తోంది. శనివారం ఓపి (ఔట్‌ పేషెంట్స్‌)కి చిన్నపిల్లల విభాగానికి సంబంధించి వందల సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను వైద్యం కోసం తీసుకువచ్చారు. అయితే వైద్యులు ఉదయం 11 గంటలైనా రాకపోవడంతో చిన్నారులు, రోగులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి బయటి రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అందులోను చిన్నారులు మరి ఎక్కువగా వస్తారు.

అయితే ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు ముగ్గురే ఉన్నారు. వారిలో ఒకరు సెలవులో ఉన్నారు, మరొక డాక్టర్‌ అత్యవసర విభాగంలో విధుల్లో ఉన్నారు. దీంతో వందల సంఖ్యలో రోగులు బారులు తీరారు. కాగా డాక్టర్‌ కేశవులు ఒక్కరే అందరికీ వైద్య సేవలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement