కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Jul 25 2016 10:54 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయి పురవీధుల వరకు బారులు తీరారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
హుండీ లెక్కింపులో స్థానికులకు అవకాశం
కాగా మల్లన్న హుండీ లెక్కింపు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా హుండీ లెక్కింపు కార్యక్రమంలోకి స్థానికులు, భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement