ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నాగులపల్లి వద్ద బుధవారం జరిగింది
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నాగులపల్లి వద్ద బుధవారం జరిగింది. తాండూరుకు చెందిన ఓ గర్భిణీ బంధువులతో కలిసి జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్కు వెళుతోంది. కాగా.. బస్సు నాగులపల్లి సమీపంలోకి రాగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంట ఉన్న బంధువులు బస్సులోనే పురుడు పోశారు. అనంతరం 108 సిబ్బంది వచ్చి తల్లి బిడ్డలకు వైద్య సేవలు అందించారు.