ఎద్దును ఢీకొన్న కానిస్టేబుళ్లకు గాయాలు | dashed to bull.. constables injured | Sakshi
Sakshi News home page

ఎద్దును ఢీకొన్న కానిస్టేబుళ్లకు గాయాలు

Oct 21 2016 2:22 AM | Updated on Apr 3 2019 7:53 PM

తాడేపల్లిగూడెం రూరల్‌ : ఎద్దును ఢీకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఆరుళ్ల వద్ద జరిగింది.

 
తాడేపల్లిగూడెం రూరల్‌ :  ఎద్దును ఢీకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఆరుళ్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఎద్దు మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిడదవోలు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా, ఎద్దు ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. ఈ సమయంలో తుని నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వారిని గమనించి అంబులెన్సులో నిడదవోలు తరలించారు. కానిస్టేబుళ్ల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement