ఎద్దును ఢీకొన్న కానిస్టేబుళ్లకు గాయాలు | dashed to bull.. constables injured | Sakshi
Sakshi News home page

ఎద్దును ఢీకొన్న కానిస్టేబుళ్లకు గాయాలు

Oct 21 2016 2:22 AM | Updated on Apr 3 2019 7:53 PM

తాడేపల్లిగూడెం రూరల్‌ : ఎద్దును ఢీకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఆరుళ్ల వద్ద జరిగింది.

 
తాడేపల్లిగూడెం రూరల్‌ :  ఎద్దును ఢీకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఆరుళ్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఎద్దు మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిడదవోలు పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా, ఎద్దు ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. ఈ సమయంలో తుని నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వారిని గమనించి అంబులెన్సులో నిడదవోలు తరలించారు. కానిస్టేబుళ్ల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement