డయల్‌ యువర్‌ ఆర్‌ఎంకు 14 ఫిర్యాదులు | ‌dail your Rm | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ఆర్‌ఎంకు 14 ఫిర్యాదులు

Aug 24 2016 10:57 PM | Updated on Mar 19 2019 6:59 PM

కరీంనగర్‌ రీజియన్‌లోని ప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కారారం కోసం బుధవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఆర్‌ఎంకు 14 మంది ఫోన్లు చేశారు

మంకమ్మతోట: కరీంనగర్‌ రీజియన్‌లోని ప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కారారం కోసం బుధవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఆర్‌ఎంకు 14 మంది ఫోన్లు చేశారు. కరీంనగర్‌ నుంచి కామారెడ్డికి రాత్రి 7నుంచి 8గంటల మధ్య బస్సు నడిపించాలని దేవయ్య అనే వ్యక్తి కోరారు. కరీంనగర్‌ నుంచి బెజ్జంకి వెళ్లే బస్సులను వాగేశ్వరి కళాశాల వద్ద ఆపాలని మన్మోహన్‌ అనే ప్రయాణికుడు కోరారు. శాతవాహన యూనిర్సిటీకి వచ్చేబస్సులో సమయాన్ని సూచించేలా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement