'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు' | CPI Ramakrishna slams Venkaiah Naidu over CPI Ramakrishna Issue | Sakshi
Sakshi News home page

'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'

Aug 12 2015 4:14 PM | Updated on Aug 13 2018 4:30 PM

'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు' - Sakshi

'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక ప్రాకేజీ అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక ప్రాకేజీ అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మోసగాడిగా మిగిలిపోతారని చెప్పారు.

ఈనెల 22, 23 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement