గోమాతకు ప్రకృతి శాంతి పూజలు | cows pooja | Sakshi
Sakshi News home page

గోమాతకు ప్రకృతి శాంతి పూజలు

Dec 13 2016 10:44 PM | Updated on Sep 4 2017 10:38 PM

సకల దేవతామూర్తులు కొలువై ఉన్న గోమాతను పూజించాల్సిన సమయంలో హింసించడం వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి

వెలుగుబంద (రాజానగరం) : 
సకల దేవతామూర్తులు కొలువై ఉన్న గోమాతను పూజించాల్సిన సమయంలో హింసించడం వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని రక్షించగల శక్తి ఒక్క గోమాతకే ఉందన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ రాజానగరం మండలం, వెలుగుబందలో మంగళవారం గోమాతకు ప్రకృతి శాంతి పూజలు చేశారు. అదే గ్రామానికి చెందిన ప్రగడ సత్యనారాయణ ఆధ్వర్యంలో గోగాయత్రీ మంత్రపఠనం, కామధేను కలశపూజ, గో ప్రదక్షిణ చేశారు. రానున్న కొత్త సంవత్సరం అంతా హాయిగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని కాపాడాలని వేడుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement