ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వంచించిన తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజల పక్షాన పోరాడాలని పీసీసీ అధ్యక్షుడు ఎ¯ŒS.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. 2019లో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలన్నారు.
-
∙వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యం ∙పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
-
∙డీసీసీ అధ్యక్షునిగా నానాజీ ప్రమాణస్వీకారం
కాకినాడ :
ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా వంచించిన తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ప్రజల పక్షాన పోరాడాలని పీసీసీ అధ్యక్షుడు ఎ¯ŒS.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. 2019లో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది. రఘువీరారెడ్డి నానాజీతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో దాదాపు 600కి పైగా హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తీరుపై ప్రజల పక్షాన పోరాడాలని, రాబోయే కాలంలో కేంద్రంలో రాహుల్గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పార్టీ కేడర్ పినిచేయాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ బడా కార్పొరేటర్లతో లాలూచీ పడి చేసిన నోట్ల రద్దుతో బీజేపీ పతనం ఖాయమన్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మరో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, మాజీ మంత్రి కోండ్రు మురళి, పీసీసీ ఉపాధ్యక్షుడు బుచ్చిమహేశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు ప్రసంగించా. మాజీ మంత్రి బాలరాజు, నగరకాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఎస్ఎ¯ŒS రాజా, రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల ఇ¯ŒSచార్్జలు అద్దంకి ముక్తేశ్వరరావు, పాండురంగారావు, పంతం ఇందిర, ఏఐసీసీ శిక్షణా విభాగం అధ్యక్షుడు రామినీడు మురళి తదితరులు పాల్గొన్నారు.