ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌ | collector went to delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌

Feb 23 2017 12:14 AM | Updated on Mar 21 2019 8:35 PM

దేశ ప్రధానమంత్రి నుంచి ఎక్స్‌లెన్స్‌ పురష్కారాన్ని అందుకునేందుకు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ బుధవారం ఢిల్లీ వెళ్లారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): దేశ ప్రధానమంత్రి నుంచి ఎక్స్‌లెన్స్‌ పురష్కారాన్ని అందుకునేందుకు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ బుధవారం ఢిల్లీ వెళ్లారు. భూగర్భజాలాల పెంపునకు సంబంధించి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ పురష్కారానికి జిల్లా ఎంపికయింది. జాతీయ గ్రామీణ హామీ పథకం, ఐడబ్ల్యూఎంపీ వాటర్‌ షెడ్‌లు, నీటిపారుదల శాఖల ద్వారా జిల్లా కలెక్టర్‌ భూగర్భ జలాల పెంపునకు విశేషంగా కృషి చేశారు. ఫలితంగా భూగర్భ జలాల అభివృద్ధిలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఇందుకు జిల్లాకు ఈ పురష్కారం లభించింది. జిల్లా తరుపున కలెక్టర్‌ గురువారం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పురష్కారం అందుకోనున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement