తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. మూగజీవాలు మృతి | Cattle killed due to current shock | Sakshi
Sakshi News home page

తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. మూగజీవాలు మృతి

Jul 25 2016 12:40 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.

బొమ్మలరామారం: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. జిల్లాలోని బొమ్మల రామారం మండలం బండకాడిపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని స్థానికులు గమనించకపోవడంతో.. అటుగా వెళ్లిన 8 గేదెలు, ఒక ఆవు, రెండు నక్కలు మృతి చెందాయి. పశువులు మృతి తో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement