ఎమ్మెల్యేను అడ్డుకున్న కందికుంట వర్గీయులపై కేసులు | cases on kandikunta gang | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను అడ్డుకున్న కందికుంట వర్గీయులపై కేసులు

Nov 27 2016 10:46 PM | Updated on Sep 4 2017 9:17 PM

కదిరి ఎమ్మెల్యే అక్తర్‌ చాంద్‌బాషాను అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులపై కేసు నమోదైంది.

నల్లచెరువు : కదిరి ఎమ్మెల్యే అక్తర్‌ చాంద్‌బాషాను అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులపై కేసు నమోదైంది. మండల పరిధిలోని గోరంట్లవారిపల్లి గ్రామంలో ఈ నెల 26వ తేదీ(శనివారం) జనచైతన్య యాత్రలో భాగంగా పర్యటించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కందికుంట అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయమై గాజిఖాన్‌పల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఫయాజ్‌ఖాన్‌ ఆదివారం నల్లచెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆ మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అనుచరులు ఐదుగురిపై 143, 341, రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక‌్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితులలో ఎ-1గా ఎంపీటీసీ మహబుబ్‌బాషా, ఎ-2గా జగన్‌మోహన్‌రెడ్డి, ఎ-3గా నరసారెడ్డి, ఎ-4గా వెంకటరమణ, ఎ-5గా రాజారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement