భవనం.. భయం భయం! | buling fear | Sakshi
Sakshi News home page

భవనం.. భయం భయం!

Oct 4 2016 1:13 AM | Updated on Oct 16 2018 6:33 PM

భవనం.. భయం భయం! - Sakshi

భవనం.. భయం భయం!

జోరుగా కురుస్తున్న వర్షాలు.. కాలంతీరిన భవనాలు.. నానిన గోడలు.. శ్లాబులు.. ఎప్పుడు కూలుతాయో తెలియని అయోమయం.. ఇలా పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది.

  • శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలు 
  • యజమానులకు ‘మున్సిపల్‌’ నోటీసులు 
  • తర్వాత పట్టించుకోని అధికారులు 
  • వర్షాలకు కూలుతాయేమోనని పరిసర ప్రజల ఆందోళన 
  • కొత్తగూడెం :  జోరుగా కురుస్తున్న వర్షాలు.. కాలంతీరిన భవనాలు.. నానిన గోడలు.. శ్లాబులు.. ఎప్పుడు కూలుతాయో తెలియని అయోమయం.. ఇలా పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇదే తరహా ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అయినప్పటికీ పాత భవనాల కూల్చివేత విషయంలో అధికారుల్లో చలనం కనిపించడం లేదు. కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత పట్టించుకునే నాధులే కరువయ్యారు. 
    పురాతన భవనాలు ప్రజలను వణికిస్తున్నాయి. కాలంతీరిన భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పురాతన భవనాల గోడలు నానిపోయాయి. కొన్ని భవనాల గోడల్లో మొక్కలు పెరిగిపోయి దెబ్బతినగా.. మరికొన్ని పాక్షికంగా కూలిపోయి ఉండటంతో ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు భయాందోâýæనకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన పాతకాలం భవనాలు వరుసగా కూలిపోయి.. ప్రమాదాలు సంభవిస్తుండటంతో ఇక్కడి ప్రజల్లో కూడా ఇదే భయాందోâýæన కొనసాగుతోంది. పాత భవనాలను ఎక్కడికక్కడ కూల్చివేయాలని అటు ప్రభుత్వం ఆదేశించినా.. ఇటు ప్రజలు విజ్ఞప్తులు చేసినా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ ఒత్తిâýæ్లకు తలొగ్గి పాత భవనాల జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. 
    నోటీసులిచ్చి వదిలేస్తున్న అధికారులు 
    ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గల పురాతన భవనాలను అధికారులు గుర్తించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 25, ఇల్లెందులో 30, మధిరలో 13, సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 67 భవనాలను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి ఏళ్లు గడుస్తున్నాయి. కానీ.. ఇప్పటివరకు వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లలో నివసించే ప్రజలు భయాందోâýæనలకు గురవుతున్నారు. ఇప్పటిౖకెనా అధికారులు స్పందించి గుర్తించిన భవనాలను కూల్చివేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 
    రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి 
    పట్టణంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. రెండేâýæ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని మేదరబస్తీలో పాతకాలం భవనం కూలిపోవడంతో.. అందులో నివాసం ఉంటున్న వారిలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ పురాతన భవనం పాక్షికంగా కూలింది. అయితే ఆ భవనం గాంధీ జయంతి రోజు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం పక్కనే మరో భవనంలో బ్రాందీ షాపు ఉండటం.. ప్రతిరోజు అక్కడ వందలాది మందితో రద్దీగా ఉంటుంది. గాంధీ జయంతి కావడంతో వై¯Œ్స బంద్‌ ఉండటంతో జనసంచారం లేదు. దీంతో భవనం కూలినప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కూలిన భవనానికి చెందిన కొన్ని శిథిలాలు వై¯Œ్సకు చెందిన బాత్‌రూమ్‌లో సైతం పడటం గమనార్హం. 
    ప్రమాదకరంగా ఉంటే తొలగిస్తాం..  
    మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలను ఇప్పటికే గుర్తించాం. ఇప్పటికే భవనాల యజమానులకు నోటీసులు అందజేశాం. వాటిని యజమానులు తొలగించని పక్షంలో ప్రమాదకరంగా మారితే భవనాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూల్చివేస్తాం.                 
    – సైఫుల్లా అహ్మద్, మున్సిపల్‌ కమిషనర్, కొత్తగూడెం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement