డివైడర్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

డివైడర్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

Published Tue, Mar 29 2016 11:16 PM

B tech student killed hitting divider in medak district

మెదక్‌: మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి.

వారు ప్రయాణిస్తున్న బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement