రిటైర్డ్‌ లెక్చరర్లు దరఖాస్తు చేసుకోవాలి | applications inviting for lecturers | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ లెక్చరర్లు దరఖాస్తు చేసుకోవాలి

Aug 22 2016 5:20 PM | Updated on Sep 4 2017 10:24 AM

మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సివిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు రిటైర్డ్‌ లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కె. శ్రీనివాస్‌ తెలిపారు.

మిరుదొడ్డి: మండల కేంద్రమైన మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సివిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు రిటైర్డ్‌ లెక్చరర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కె. శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన మిరుదొడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపికైన లెక్చరర్లకు ప్రతి పీరియడ్‌కు రూ. 150లు చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10  వేల  వేతనం మించకుండా చెల్లిస్తామన్నారు. ఆసక్తి కలిగిన రిటైర్డ్‌ లెక్చరర్లు ఈ నెల 27వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement